పనులు ప్రారంభించిన ఎమ్మెల్యే గడ్డం వివేక్
NEWS Jan 04,2025 10:58 am
మంచిర్యాల జిల్లా చెన్నూరు నియోజకవర్గం జైపూర్ మండలం ఇందారం దొరగారిపల్లె లో పర్యటించారు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి. సీసీ రోడ్డు, డ్రైనేజ్ పనులకు శంకుస్థాపన చేశారు. ఎమ్మెల్యే వెంట మండల నాయకులు, కార్యకర్తలు, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.. గ్రామ అభివృద్ధి కి పూర్తి స్థాయిలో సహకరిస్తానని, పెద్ద ఎత్తున నిధులు వచ్చేలా చేస్తానని అన్నారు గడ్డం వివేక్. గత ప్రభుత్వం రహదారులను పట్టించు కోలేదని ఆరోపించారు.