గేమ్ ఛేంజర్ ఈవెంట్ మెగా ఫ్యాన్స్ కు పండుగ
NEWS Jan 04,2025 07:11 am
రామ్ చరణ్, కియారా అద్వానీ కలిసి నటించిన గేమ్ ఛేంజర్ మూవీ ప్రీ రిలీజ్ వేడుక ఏర్పాట్లు ఘనంగా జరుగుతున్నాయి రాజమండ్రి రూరల్ లో. మంత్రి కందుల దుర్గేష్ ఏర్పాట్లను పరిశీలించారు. ఈ వేడుకకు ముఖ్య అతిథిగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ హాజరవుతున్నారు. సుమారు గంట పాటు ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. పెద్ద సంఖ్యలో ఫ్యాన్స్ రావడంతో లా అండ్ ఆర్డర్ పై సమీక్షించారు. పలు సూచనలు చేశారు.