శ్రీవారిని దర్శించుకున్న వేద విద్యార్థులు
NEWS Jan 04,2025 06:59 am
తిరుమల ధర్మగిరి వేద విజ్ఞాన పీఠంలోని వేద విద్యార్థులు శ్రీవేంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. పవిత్ర ధనుర్మాసంలో తమ పీఠంలో విద్యార్థులు ధనుర్మాస వ్రతం ఆచరించిన సందర్బంగా అదనపు ఈవో దర్శన ఏర్పాట్లు చేశారు. వేద విజ్ఞాన పీఠం ప్రధానోపాధ్యాయులు అవధాని ఆధ్వర్యంలో విద్యార్థులు, టీచర్లు మాడ వీధుల్లో శ్రీ విష్ణు సహస్ర నామ పారాయణ గోష్టి చేశారు.