గేమ్ ఛేంజర్ ఈవెంట్ కు పవన్ కళ్యాణ్
NEWS Jan 04,2025 05:33 am
శంకర్ దర్శకత్వంలో రామ్ చరణ్ , కియారా అద్వానీ కలిసి నటించిన గేమ్ ఛేంజర్ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ రాజమండ్రిలో జరగనుంది. ఈ కార్యక్రమానికి విశిష్ట అతిథిగా హాజరు కానున్నారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. ఈ ఈవెంట్ కు లక్ష మందికి పైగా మెగా ఫ్యాన్స్ వస్తారని అంచనా వేశారు నిర్వాహకులు. 40 ఎకరాల స్థలంలో ఈవెంట్ నిర్వహిస్తారు. రాజమండ్రి రూరల్ వేమగిరిలో స్టేజ్ ఏర్పాటు చేశారు.