లింగ నిర్ధారణ పరీక్షలు నేరం
NEWS Jan 04,2025 05:42 am
మెట్ పల్లి పట్టణంలోని మూడు స్కానింగ్ కేంద్రాలను శుక్రవారం మాత శిశు సంరక్షణ అధికారి డాక్టర్ జైపాల్ రెడ్డి తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ లింగ నిర్ధారణ పరీక్షలు చట్టరీత్యా నేరమని, స్కానింగ్ కేంద్రాల్లో లింగ నిర్ధారణ పరీక్షలు చేస్తే కఠిన చర్యలు తప్పవని క్రిమినల్ కేసులు నమోదు అవుతాయని అన్నారు. ఈ సందర్భంగా పలు స్కానింగ్ సెంటర్ లలో రికార్డులను, వివరాలను అనుమతులను పరిశీలించారు.