శ్రీవారి హుండీ ఆదాయం రూ. 3.34 కోట్లు
NEWS Jan 04,2025 05:00 am
తిరుమల శ్రీవారిని 56 వేల 560 మంది భక్తులు దర్శించుకున్నారు. 28 వేల 853 మంది భక్తులు తల నీలాలు సమర్పించారు. భక్తులు సమర్పించే కానుకలు, విరాళాల రూపేణా శ్రీవారి హుండీ ఆదాయం రూ. 3.44 కోట్లు వచ్చినట్లు ఈవో శ్యామల రావు వెల్లడించారు. ప్రస్తుతం దర్శనం కోసం క్యూ లైన్ కొనసాగుతోందని, ఎలాంటి టోకెన్లు లేని భక్తులకు కనీసం 8 గంటలకు పైగా సమయం పడుతుందన్నారు.