డిగ్రీ పరీక్షల్లో పదిమంది విద్యార్థులు డీబార్
NEWS Jan 04,2025 05:46 am
శాతవాహన యూనివర్సిటీ పరిధిలో నిర్వహిస్తున్న డిగ్రీ మూడో, ఐదో సెమిస్టర్ పరీక్షల్లో మాల్ ప్రాక్టిస్కు పాల్పడ్డ పదిమంది విద్యార్థులను డీబార్ చేసినట్లు ఎస్యూ అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు. KNRలోని అపూర్వ డిగ్రీ కళాశాలలో 2, శివాని డిగ్రీ కళాశాలలో 2, శ్రీచైతన్య డిగ్రీ కళాశాలలో 1, కిమ్స్ డిగ్రీ కళాశాలలో 3, పెద్దపల్లిలోని డిగ్రీ కళాశాలలో 1, ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఒక విద్యార్థి డీబార్ అయినట్లు పేర్కొన్నారు.