ఉచిత బస్సు ప్రయాణంపై మంత్రుల ఆరా
NEWS Jan 03,2025 01:42 pm
కర్ణాటకలో అమలవుతున్న మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంపై అధ్యయనం కోసం మంత్రులు రాం ప్రసాద్ , అనిత వంగలపూడి , గుమ్మడి సంధ్యా రాణితో పాటు రవాణా శాఖ ముఖ్య కార్యదర్శి కాంతిలాల్ దండేతో కలిసి పర్యటించారు. బస్సులలో ప్రయాణిస్తున్న మహిళలను అడిగి తెలుసుకున్నారు. కలుగుతున్న సౌకర్యం, లబ్ధి గురించి వాకబు చేశారు. త్వరలోనే ఏపీలో కూడా ఉచిత బస్సు ప్రయాణం కల్పించనున్నారు.