సావిత్రి భాయి ఫూలే జయంతి వేడుకలు
NEWS Jan 03,2025 11:32 am
మెట్పల్లి: ప్రభుత్వ జూనియర్ కళాశాలలో జాతీయ సేవా పథకం ఆధ్వర్యంలో కళాశాల ప్రిన్సిపల్ వెంకటేశ్వరరావు అధ్యక్షతన జాతీయ మహిళా ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా సావిత్రిబాయి పూలే జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. స్త్రీవిద్య, సామాజిక దురాచారాల నిర్మూలన, విజ్ఞానం స్వేచ్ఛ స్వాతంత్రాలను శ్రీజాతికి ప్రసాదించిన సంఘసంస్కర్త భారత దేశపు మొదటి మహిళా ఉపాధ్యాయుని సావిత్రిబాయి పూలే అని అన్నారు. 1831 జనవరి 3న మహారాష్ట్ర సాతారా జిల్లా నయాగావ్ గ్రామంలో జన్మించారని తెలిపారు.