రిపబ్లిక్ డే రోజున అంబేద్కర్ చిత్రపటాన్ని స్థానం కల్పించాలి
NEWS Jan 03,2025 09:39 am
భారత రాజ్యాంగం రాసిన అంబేద్కర్ గారి చిత్రపటాన్ని ప్రతి రిపబ్లిక్ డే రోజున చిత్రపటానికి పూలమాల వేసి ముందు ఉంచాలని ఎంపీడీవోకు అంబేద్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో వినతిపత్రం అందజేశారు. ఈ అధ్యక్షులు కలికోట రాజయ్య మాట్లాడుతూ.. ప్రతి జెండా వద్ద అంబేద్కర్ చిత్రపడాన్ని ఉంచాలని కోరారు. అదేవిధంగా ప్రతి పాఠశాలలో అంబేద్కర్ పై వ్యాసరచన పోటీలు నిర్వహించి అంబేద్కర్ విలువను పెంచే విధంగా ఉండాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షులు బాల నీలకంఠం, ప్రధాన కార్యదర్శి శనిగారపు గణేష్, నవీన్ పాల్గొన్నారు.