ఈదులకుంట ఆనవాళ్లపై హైడ్రా ఆరా
NEWS Jan 03,2025 06:01 am
హైడ్రా దూకుడు పెంచింది. గతంలో ఆనవాళ్లు లేకుండా పోయిన చెరువులను గుర్తించే పనిలో పడింది. శేరిలింగంపల్లి మండలం ఖానామెట్లో ఉన్న ఈదులకుంట ఆనవాళ్లను హైడ్రా వెలికి తీస్తోంది. సర్వేఆఫ్ ఇండియా సహకారంతో సర్వే చేయించి హద్దుల నిర్ధారించే పనికి శ్రీకారం చుట్టింది. ఖానామెట్ , కూకట్ పల్లి గ్రామాల సరిహద్దులో ఉన్న ఈ చెరువు మాయమైందని స్థానికులు ఫిర్యాదు చేయడంతో రంగంలోకి దిగింది.