శ్రీవారి హుండీ ఆదాయం రూ. 4.17 కోట్లు
NEWS Jan 03,2025 03:58 am
తిరుమల శ్రీవారికి భారీ ఆదాయం సమకూరింది. కానుకలు, విరాళాల రూపేణా శ్రీవారి హుండీ ఆదాయం రూ. 4.17 కోట్లు వచ్చినట్లు ఈవో శ్యామల రావు వెల్లడించారు. శ్రీవారిని 62,085 మంది భక్తులు దర్శించుకోగా , 15,680 మంది తలనీలాలు సమర్పించారు. ప్రస్తుతం స్వామి వారి దర్శనం కోసం 6 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. ఎలాంటి టోకెన్లు లేని భక్తులకు 12 గంటలకు పైగా సమయం పడుతుంది.