వలస పక్షులు తిరిగి వస్తున్నాయి
NEWS Jan 03,2025 05:00 am
స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎగిరేది కాషాయ జెండానే, ఎన్నికలు వస్తున్నందునే వలస పక్షులు మళ్లీ వాలున్నాయని ఎమ్మెల్సీ కవితను పరోక్షంగా ఉద్దేశించి నిజామాబాద్ ఫ్లోర్ లీడర్ స్రవంతి రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. నిజామాబాద్ జిల్లా బీజేపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ జనం ఎమ్మెల్సీ కవితను ఎప్పుడో మరిచిపోయరన్నారు. ఎన్నికలు ఉన్నాయని వలస పక్షులు తిరిగి వస్తున్నాయని ఎద్దెవా చేశారు. నిజామాబాద్ కార్పొరేషన్ ను బీజేపీ కైవసం చేసుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు