రాష్ట్రాభివృద్ధి కోసం సీఎం చంద్రబాబు నాయుడు రేయింబవళ్లు కృషి చేస్తున్నారన్నారు. జగన్ ప్రభుత్వంలో ఉద్యోగులు తీవ్ర వేధింపులకు గురయ్యారన్నారు. రాజ్యాంగ బద్ధంగా రావాల్సిన హక్కులు సైతం అందలేదన్నారు. ఇదేమిటని ప్రశ్నించిన వారిపై అక్రమ కేసులు బనాయించి, జైలు పాలు చేశారన్నారు. చివరికి జీతాలు, పెన్షన్లు సైతం సకాలంలో వచ్చిన సందర్బం లేదన్నారు.