టిటిడి శ్రీవారి ప్రాణదాన ట్రస్టుకు రూ.10 లక్షలను టీటీడీ మాజీ చైర్మన్ వ్యక్తిగత కార్యదర్శి కుప్పాల గిరిధర్ కుమార్ విరాళంగా అందజేశారు. తిరుమల క్యాంప్ కార్యాలయంలో టిటిడి అదనపు ఈఓ సి.హెచ్. వెంకయ్య చౌదరిని కుటుంబ సభ్యులతో కలిసి చెక్ ను అందజేశారు. శ్రీవారి ప్రాణదాన ట్రస్ట్ ద్వారా టీటీడీ ఎందరికో విశిష్ట సేవలందిస్తోందని భక్తుడు పేర్కొన్నారు.