కేంద్ర ప్రభుత్వం ఖేల్ రత్న అవార్డులను ప్రకటించింది. చిన్న వయసులోనే ప్రపంచ చెస్ ఛాంపియన్ గా నిలిచిన గుకేశ్ దొమ్మరాజుతో పాటు ఒలింపిక్స్ షూటింగ్ విజేత మను బాకర్ , హాకీ ప్లేయర్ హర్మన్ ప్రీత్ సింగ్ , పారా అథ్లెట్ ప్రవీణ్ కుమార్ కు ఖేల్ రత్న వరించింది. 32 మందికి అర్జున అవార్డులు, 17 మందికి పారా అథ్లెటిక్స్ అవార్డులు ప్రకటించింది. ఈనెల 17న పురస్కారాలను ప్రధానం చేయనున్నారు.