నిజామాబాద్ లో ఏకసభ్య బహిరంగ విచారణ
NEWS Jan 02,2025 03:37 pm
షెడ్యూల్డ్ కులాల్లో ఉప వర్గీకరణపై వివరణాత్మక అధ్యయనం కోసం రాష్ట్ర ప్రభుత్వంచే నియమించబడిన హైకోర్టు మాజీ న్యాయమూర్తి డాక్టర్ జస్టిస్ షమీమ్ అక్తర్ తో కూడిన ఏక సభ్య కమిషన్ నిజామాబాద్ లో బహిరంగ విచారణ నిర్వహించారు. ఉమ్మడి జిల్లాకు చెందిన షెడ్యూల్డ్ కులాల ప్రజా ప్రతినిధులు, గెజిటెడ్, నాన్ గెజిటెడ్ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, వైద్యులు, న్యాయవాదులు, షెడ్యూల్డు కుల సంఘాలు ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది.