బాన్సువాడ: బాన్సువాడ జూనియర్ సివిల్ జడ్జి కోర్టు అసిస్టెంట్ ప్రభుత్వ న్యాయవాదిగా లక్ష్మీనారాయణమూర్తి బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తన నియామకానికి కృషి చేసిన వ్యవసాయ సలహాదారు, పోచారం శ్రీనివాస్ రెడ్డి, ఆగ్రో ఇండస్ట్రీస్ కార్పొరేషన్ ఛైర్మన్ కాసుల బాలరాజ్ కు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ సందర్భంగా న్యాయవాదులు లక్ష్మీనారాయణ మూర్తికి శుభాకాంక్షలు తెలిపారు.