సంక్రాంతికి ఆరు ప్రత్యేక రైళ్లు
NEWS Jan 02,2025 04:56 am
దక్షిణ మధ్య రైల్వే కీలక ప్రకటన చేసింది. సంక్రాంతి పండుగను పురస్కరించుకుని ఇవాల్టి నుంచి గోదావరి జిల్లాలకు ఆరు ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేసినట్లు వెల్లడించింది. ఇప్పటి నుంచే బుకింగ్స్ కూడా స్టార్ట్ చేస్తామని పేర్కొంది. కాచిగూడ..కాకినాడ టౌన్, హైదరాబాద్-కాకినాడ టౌన్ మధ్య రైళ్లు నడిపిస్తామని తెలిపింది. జనవరి 9, 10, 11, 12 తేదీల్లో రైళ్ల రాకపోకలు సాగిస్తాయని పేర్కొంది.