తెలంగాణ ప్రభుత్వానికి బిగ్ షాక్ తగిలింది. జాతీయ మానవ హక్కుల కమిషన్ (ఎన్ హెచ్ ఆర్ సీ ) నోటీసులు జారీ చేసింది. సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన కేసుకు సంబంధించి లాఠీఛార్జి చేసిన పోలీసులపై చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. లాయర్ రామారావు దాఖలు చేసిన పిటిషన్ పై విచారణ చేపట్టింది. 4 వారాల్లోగా నివేదిక ఇవ్వాలని డీజీపీ జితేందర్ కు స్పష్టం చేసింది కమిషన్.