నిజామాబాద్ పట్టణాభివృద్దికి టీయుఎఫ్ఐడీసీ ద్వారా రూ. 60 కోట్లు మంజూరు చేయడం జరిగిందన్నారు నూడా చైర్మన్ కేశ వేణు. ఈ నిధుల ద్వారా సీసీ రోడ్లు, డ్రైనేజీల నిర్మాణం చేపడతామన్నారు. నిజామాబాద్ జిల్లా ప్రజల తరపున సీఎం రేవంత్ రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు. సహకరించిన పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ, ఎమ్మెల్యేలకు కృతజ్ఞతలు తెలియ చేశారు.