సుజిత్ రావ్ జన్మదిన సందర్భంగా
విద్యార్థులకు నోటుబుక్స్ పంపిణీ
NEWS Dec 31,2024 07:28 pm
కాంగ్రెస్ సీనియర్ నాయకులు,పిసిసి డెలిగేట్ మెంబర్ కల్వకుంట్ల సుజిత్ రావు జన్మదిన సందర్భంగా విద్యార్థులకు మెట్ పల్లి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కూన గోవర్ధన్ నోటు బుక్కులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా గోవర్ధన్ మాట్లాడుతూ సుజిత్ రావు ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాట్లు, రానున్న కాలంలో రాజకీయంగా మరింత రాణించాలని కోరుతున్నట్టు తెలిపారు. మెట్ పల్లి మార్కెట్ కమిటీ చైర్మన్ కూన గోవర్ధన్, పట్టణ కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షులు కూతుబ్ పాషా మరియు నాయకులు ఉన్నారు.