ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తే చర్యలు
NEWS Dec 31,2024 01:56 pm
నూతన సంవత్సర వేడుకల సందర్భంగా ప్రజలను ఎవరైనా రాత్రి సమయంలో ఇబ్బందులకు గురి చేస్తే చర్యలు తప్పవని నిజామాబాద్ ఇంచార్జ్ పోలీస్ కమిషనర్ సింధు శర్మ తెలిపారు. నిజామాబాద్ పోలీస్ కమీషనరేటు పరిధిలోని నిజామాబాద్, ఆర్మూర్, బోధన్ డివిజన్ పరిధిలోని అన్ని ప్రాంతాలలో డిసెంబర్ 31న రాత్రి నూతన సంవత్సర వేడుకలు జరుపుకునే సందర్బంగా కమిషనరేట్ పరిధిలోని వైన్స్, కల్లు దుకాణాలకు రాష్ట్ర ప్రభుత్వము నుండి అనుమతి పొందిన సమయం వరకే మద్యం విక్రయించాలన్నారు.