31న అతిక్రమిస్తే కఠిన చర్యలు: ఎస్ఐ
NEWS Dec 31,2024 11:44 am
కోరుట్ల: నూతన సంవత్సర వేడుకలు ప్రశాంతమైన వాతావరణంలో జరుపుకోవాలని కోరుట్ల ఎస్ఐ శ్రీకాంత్ తెలిపారు. డిసెంబర్ 31న ప్రధాన రహదారుల్లో యువకులు మద్యం తాగి వాహనాలు నడపటం, మైనర్లు వాహనాల నడపటం, ట్రిపుల్ డ్రైవింగ్, ర్యాష్ డ్రైవింగ్ వంటివి చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. రోడ్లపై కేక్ కటింగ్, డీజలకు పర్మిషన్ లేదని, స్ట్రీట్ లైట్లు పలగగొట్టడం, ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తే రౌడీ షీట్ ఓపెన్ చేస్తామన్నారు.