మానసిక వికలాంగులకు విద్యార్థుల వితరణ
NEWS Dec 31,2024 01:59 pm
నూతన సంవత్సరం సందర్భంగా గాయత్రీ విద్యానికేతన్లోని 9వ తరగతి విద్యార్థులు సమాజానికి తమ వంతుగా మంచి చేయాలని ఉద్దేశంతో డబ్బులు సమకూర్చుకొని పెద్దపల్లిలోని స్ఫూర్తి మానసిక దివ్యాంగుల కేంద్రంలో బియ్యం, నిత్యావసర వస్తువులు సమకూర్చారు. 9వ తరగతిలోనే వారికి ఇంత మంచి ఆలోచన రావడం, ఆ ఆలోచన కార్యరూపం దాల్చడం, విందు వినోదాలకు ప్రాధాన్యం ఇవ్వకుండా సమాజానికి తమ వంతుగా మంచి చేయాలని సంకల్పించడం అభినందనీయమని చైర్మన్ శ్రీనివాస్ విద్యార్థులను అభినందించారు.