200 ఎకరాల ప్రభుత్వ భూమిని కాపాడాం
NEWS Dec 31,2024 07:38 am
హైదరాబాద్ లో 200 ఎకరాల ప్రభుత్వ భూమిని కాపాడడం జరిగిందన్నారు హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్. హైడ్రా ఏర్పడి 5 నెలలైందని, కొత్త ఏడాదిలో రూట్ మ్యాప్ సిద్దం చేశామన్నారు. ఓఆర్ఆర్ వరకు హైడ్రా పరిధి ఉందన్నారు. సీఎం రేవంత్ రెడ్డి దీనికి చైర్మన్ గా ఉంటారని చెప్పారు. 12 చెరువులు, 8 పార్కులు అన్యాక్రాంతం కాకుండా కాపాడడం జరిగిందన్నారు కమిషనర్.