హత్య కేసులో నిందితుడికి జీవిత ఖైదు
NEWS Dec 30,2024 05:49 pm
ఇబ్రహీంపట్నం: హత్య కేసులో ఓ వ్యక్తికి జీవిత ఖైదు విధిస్తూ కోర్టు తీర్పు చెప్పింది. ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ పరిధిలో బార్లపాటి రాజేశ్వర్, పల్లె పోశెట్టి మధ్య పాత కక్షలు ఉండేవి. ఈ నేపథ్యంలో పల్లె పోశెట్టి బార్లపాటి రాజేశ్వర్ ను హత్య చేయగా కేసును విచారించిన న్యాయమూర్తి నీలిమ నిందితునికి జీవిత ఖైదు, 5000 రూపాయల జరిమానా విధించారు. ఈ కేసులో పీపీగా మల్లికార్జున్, ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్, ఇన్స్పెక్టర్ శ్రీను, ఎస్ఐ వెంకట్రావు, నిందితునికి శిక్ష పడేందుకు అవసరమయ్యే సాక్ష్యాధారాలు కోర్టుకు అందించారు.