కవితకు బీసీలు ఇప్పుడు గుర్తుకొచ్చారా? కేఏ పాల్
NEWS Dec 30,2024 05:58 pm
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు ఎన్నికలు అనగానే బీసీలు గుర్తుకొచ్చారని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ అన్నారు.నిజామాబాద్ జిల్లా సర్పంచుల సమావేశంలో మాట్లాడిన ఆయన.. బీఆర్ఎస్ నేతలపై సంచలన వ్యాఖ్యలు. ఆయన మాట్లాడుతూ.. కవిత బీసీ నినాదం తీసుకోవడం విడ్డూరంగా ఉందని, స్థానిక సంస్థల ఎన్నికలు అనగానే ఆమెకు బీసీలు గుర్తుకు వచ్చారని అన్నారు. మీ నాన్న, అన్న, మీ కుంటుంబం బీసీలు కాదని, మీరు వెలమలు అని గుర్తుచేశారు.