ఇంకా తేలని ట్రై యాంగిల్ సూసైడ్ కేసు
NEWS Dec 30,2024 06:00 pm
కామారెడ్డి జిల్లాలో కలకలం సృష్టించిన భిక్కనూరు ఎస్ఐ సాయికుమార్, బీబీ పేట కానిస్టేబుల్ శృతి, కంప్యూటర్ ఆపరేటర్ నిఖిల్ మృతి ఘటన మిస్టరీ తెలలేదు. ఈ ట్రై యాంగిల్ సూసైడ్ కేసు గురించి ఎస్పీ సింధు శర్మ మీడియాకు వివరాలు తెలిపారు. ముగ్గురు ఆత్మహత్య కేసులో ఎలాంటి ఐ విట్నెస్లు లేవని అన్నారు. ముందుగా ఒకరు చెరువులో దూకితే కాపాడేందుకు మిగతా ఇద్దరు దిగినట్లు అనుమానం వ్యక్తం చేస్తున్నామని చెప్పారు. నిఖిల్కు ప్రాణహాని ఉన్నట్లు గతంలో ఫిర్యాదు చేసిన విషయం తనకు తెలియదని ఎస్పీ తెలిపారు.