నిజామాబాద్ నగర అభివృద్ధి కృషి
NEWS Dec 30,2024 01:17 pm
నిజామాబాద్ నగర అభివృద్ధి, మౌలిక సదుపాయాల కల్పనకు కృషి చేస్తానని నుడా చైర్మన్, కాంగ్రెస్ నగర అధ్యక్షుడు కేశ వేణు అన్నారు. నగరంలోని 7, 8 డివిజన్లలో స్థానిక నాయకులతో కలిసి కేశ వేణు ఆదివారం పర్యటించారు. రోటరీనగర్ వాసులు కేశ వేణుకు తమ సమస్యలను ఏకరువు పెట్టారు. నగర అభివృద్ధికి నుడా నుంచి అవసరమైన మేరకు నిధులు విడుదలచేసే అవకాశం ఉంటే పరిశీలిస్తానన్నారు. ఇప్పటివరకు ఉన్న స్థానిక కార్పొరేటర్లు డివిజన్ అభివృద్ధిని పట్టించుకోకపోవడం కారణంగానే ఈ పరిస్థితి ఉందన్నారు.