31న అతిక్రమిస్తే కఠిన చర్యలు: డీఎస్పీ
NEWS Dec 30,2024 01:17 pm
డిసెంబర్ 31 రాత్రి కోరుట్ల, మెట్పల్లి డివిజన్ పరిధిలో నిరంతరం పోలీస్ పెట్రోలింగ్ నిర్వహిస్తామని, డ్రంక్ అండ్ డ్రైవింగ్లో పట్టుపడితే కేసులు నమోదు చేస్తామని మెట్పల్లి డిఎస్పి ఏ రాములు హెచ్చరించారు. సోమవారం స్థానిక డీఎస్పీ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో అయన మాట్లాడుతూ.. చట్టాన్ని అతిక్రమించి డిసెంబర్ 31 రాత్రి రోడ్లపైన కేకులు కట్ చేయడం, బాణాసంచాలు పేల్చడం చట్టరీత్య నేరమని, తాగి ప్రభుత్వ, ప్రైవేటు ఆస్థులపై దాడులకు పాల్పడితే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.