తాబేళ్ల మృతిపై విచారణ చేపట్టండి
NEWS Dec 30,2024 03:37 am
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తాబేళ్ల మృతిపై విచారణ చేపట్టాలని ఆదేశించారు. కాకినాడ తీరం, ఏపీఐఐసీ, వాకలపూడి ప్రాంతాల్లో అరుదైన ఆలివ్ రిడ్లీ తాబేళ్లు పెద్ద ఎత్తున చని పోయి ఉండడాన్ని తీవ్రంగా పరిగణించారు. తక్షణమే వాటి మృతికి గల కారణాలు తనకు తెలియ చేయాలని అటవీ శాఖ ఉన్నతాధికారులకు స్పష్టం చేశారు. పెద్ద ఎత్తున మరణించడం పట్ల ఆవేదన వ్యక్తం చేశారు పవన్ కళ్యాణ్.