బడులను పరిశీలించిన ఆకునూరి మురళి
NEWS Dec 30,2024 02:54 am
తెలంగాణ రాష్ట్ర విద్యా కమిషన్ చైర్మన్ ఆకునూరి మురళి ఆకస్మికంగా ప్రభుత్వ ఆధీనంలో నడుస్తున్న బడులు, గురుకులాలు, కేజీబీవీలను సందర్శించారు. ఈ సందర్బంగా పిల్లలతో కలిసి భోజనం చేశారు. వారితో చాలా సేపు మాట్లాడారు. విద్యా రంగ నిపుణులు, మేధావులు, బడుల నిర్వాహకుల నుంచి సలహాలు, సూచనలు స్వీకరించారు. మౌలిక సదుపాయాల కల్పనకు ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు.