సింహాచలం శ్రీ వరహలక్ష్మీ నృసింహ స్వామి మహిమ కలిగిన దేవుడంటూ కొనియాడారు భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు. అప్పన్న అలంకరణలతో కూడిన 2025 నూతన క్యాలెండర్ ను ఆవిష్కరించడం ఆనందంగా ఉందన్నారు. స్వామిని దర్శించుకుంటే కోరిన కోర్కెలు తీరుతాయని, ఇబ్బందులు తొలిగి పోతాయని అన్నారు. ఉత్సవాల్లో అప్పన్న స్వామికి చేసే అలంకరణలు అపురూపమన్నారు.