న్యూఇయర్ వేడుకల్లో గొడవలు చేస్తే రౌడీషీట్ ఓపెన్ చేస్తాం: సిఐ నిరంజన్ రెడ్డి
NEWS Dec 29,2024 11:40 am
నూతన సంవత్సర వేడుకలు ప్రశాంతమైన వాతావరణంలో జరుపుకోవాలని మెట్పల్లి సీఐ నిరంజన్ రెడ్డి తెలిపారు. మెట్పల్లి సర్కిల్ పరిధిలోని, ఇబ్రహీంపట్నం, మల్లాపూర్,మండలాలలో, యువతకు హెచ్చరిక జారీ చేశారు. డిసెంబర్ 31న ప్రధాన రహదారుల్లో యువకులు మద్యం తాగి వాహనాలు నడపటం, మైనర్లు వాహనాల నడపటం, ట్రిపుల్ డ్రైవింగ్, ర్యాష్ డ్రైవింగ్ వంటివి చేస్తే కఠినచర్యలు తీసుకుంటామన్నారు. ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తే రౌడీ షీట్ ఓపెన్ చేస్తామన్నారు.