గుండె పోటుతో మాధవరావు మృతి
NEWS Dec 29,2024 05:38 am
ప్రముఖ న్యాయవాది గొర్రెపాటి మాధవరావు (67) నిజామాబాద్లోని ప్రైవేటు ఆస్పత్రిలో గుండెపోటుతో చికిత్స పొందుతూ మృతి చెందారు. జీవిత కాలం ఆయన మానవ హక్కులు, పౌరహక్కుల కోసం పోరాటం చేశారు. పేదల తరఫున, ఉద్యమ కేసులను ఉచితంగా వాదించేవారు. తెలంగాణ ఉద్యమంలో ఉద్యమకారులు, విద్యార్థులపై పెట్టిన కేసులపై వాదించి ఉద్యమానికి సహకారంగా అందించారు. లా పూర్తి చేసిన తర్వాత చాలా మంది అప్రెంటిస్ చేసేవారికి గొర్రెపాటి మాధవరావు కేసులకు సంబంధించిన వివరాలను వాటిని ఎలా ఫేస్ చేయాలో వివరించేవారు.