వడ్డెర ఓబన్న విగ్రహ నిర్మాణానికి లంక లితీష్ ₹ లక్ష విరాళం
NEWS Dec 28,2024 02:17 pm
మైలవరం పట్టణంలో వడ్డెర సంఘం చేపట్టిన ఓబన్న విగ్రహ నిర్మాణ కార్యక్రమానికి శనివారం తెలుగు యువత అధ్యక్షుడు లంక లితీష్ నిర్మాణ కార్యక్రమ స్థలాన్ని పరిశీలించి తనవంతుగా లక్ష రూపాయలు విరాళంగా అందజేశారు. ఈ సందర్భంగా లితీష్ మాట్లాడుతూ.. కుల,మతాలకు అతీతంగా అందరం కలిసి మెలిసి ఉండాలని, వడ్డెర కులానికి చెందిన ఓబన్న మంచి స్వతంత్ర సమరయోధుడని, పోరాట యోధుడని, ఇలాంటి గొప్ప వ్యక్తి విగ్రహ నిర్మాణానికి తన వంతు సహకారం ఎల్లప్పుడూ ఉంటుందని తెలిపారు.