కామారెడ్డిలో ధర్మసమాజ్ పార్టీ నాయకుల దీక్ష
NEWS Dec 28,2024 02:15 pm
కామారెడ్డి: ధర్మసమాజ్ పార్టీ జిల్లా నాయకులు లక్ష్మణ్, రాజు పట్టణంలో చేపట్టిన ఆమరణ దీక్ష రెండో రోజు కొనసాగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. పేద, మధ్య తరగతి ప్రజలందరికీ ఉచిత విద్య, వైద్యం, భూమి, ఇల్లు సాధించేంతవరకు దీక్ష కొనసాగుతుందని స్పష్టం చేశారు. కార్యక్రమంలో పార్టీ జిల్లా కన్వీనర్ బోలేశ్వర్, కో-కన్వీనర్ అరవింద్, జిల్లా నాయకులు పాల్గొన్నారు.