మన్మోహన్ సింగ్ కు అంతిమ వీడ్కోలు
NEWS Dec 28,2024 10:48 am
ఢిల్లీలోని నిగమ్బోధ్ ఘాట్లో అధికారిక లాంఛనాలతో మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ అంత్యక్రియలు ముగిశాయి. అంతిమ సంస్కారాల్లో భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ఉప రాష్ట్రపతి జగదీప్ ధన్ఖడ్, ప్రధాని మోడీ, లోక్సభ స్పీకర్ ఓంబిర్లా, అమిత్షా, జేపీ నడ్డా, రాజ్నాథ్సింగ్, కిరణ్ రిజిజు, రాహుల్ గాంధీ, సోనియా గాంధీ, మల్లికార్జున ఖర్గే, రేవంత్ రెడ్డి, సిద్ధరామయ్య, సుఖ్విందర్ సింగ్ సుఖు, భూటాన్ రాజు వాంగ్చుక్ పాల్గొన్నారు.