పేదల దేవుడు పీజేఆర్
NEWS Dec 28,2024 09:27 am
పేదల దేవుడిగా గుర్తింపు పొందారు దివంగత పి. జనార్దన్ రెడ్డి. ఖైరతాబాద్ ఎమ్మెల్యేగా 1978, 1985, 1989, 1994, 2004 లలో వరుసగా గెలిచాడు. మంత్రిగా పని చేశారు. కార్మికుల, అణగారిన వర్గాల పక్షపాతిగా ఉన్నారు. పిలిచే పలికే నాయకుడిగా గుర్తింపు పొందారు. డిసెంబర్ 28న పార్టీ కార్యక్రమానికి వెళుతుండగా గుండెపోటుతో కుప్పకూలారు. ఆయన చేసిన సేవలు ఎల్లప్పటికీ గుర్తుండి పోతాయని సీఎం అన్నారు.