మహా కుంభ మేళలో టీటీడీ నమూనా ఆలయం
NEWS Dec 28,2024 06:17 am
యుపిలోని ప్రయాగ్ రాజ్ లో జనవరి 13 నుంచి ఫిబ్రవరి 26 వరకు మహా కుంభ మేళ జరగనుంది. టీటీడీ నమూనా ఆలయాన్ని ఏర్పాటు చేస్తోంది. ఈ సందర్బంగా భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు జేఈవో గౌతమి. ఎప్పటి లాగే స్వామి వారికి అన్ని కైంకర్యాలు నిర్వహించడం జరుగుతుందన్నారు. అన్ని ప్రసాదాలు అందజేయనున్నట్లు తెలిపారు.