30 నుండి తిరుమల లో అధ్యయనోత్సవాలు
NEWS Dec 28,2024 05:28 am
తిరుమల శ్రీవారి అధ్యయనోత్సవాలు డిసెంబరు 30 నుంచి 2025 జనవరి 23వ తేదీ వరకు తిరుమల ఆలయంలో నిర్వహించనున్నట్లు వెల్లడించింది టీటీడీ. స్వామి వారి ప్రాశస్త్యంపై 12 మంది ఆళ్వార్లు రచించిన దివ్య ప్రబంధ పాశురాలను శ్రీ వైష్ణవ జీయంగార్లు గోష్ఠి గానం చేస్తారు. రంగనాయకుల మండపంలో శ్రీ వైష్ణవులు పారాయణం చేస్తారు.