మల్లాపూర్ లో మాజీ పీఎంకు నివాళి
NEWS Dec 28,2024 05:31 am
మల్లాపూర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మాజీ పీఎం మన్మోహన్ సింగ్ కు నివాళులు అర్పించారు. ఆయన చిత్రపటానికి పూలమాల వేసి శ్రద్ధాంజలి ఘటించారు. దేశం గొప్ప నాయకుడిని, ఆర్థికవేత్తను కోల్పోయిందన్నారు కాంగ్రెస్ నేత జువ్వాడి కృష్ణారావు. ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పీటీసీ జలపతి రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ అంతడ్పుల పుష్ప నర్సయ్య, మండల నాయకులు పాల్గొన్నారు.