శ్రీవారి హుండీ ఆదాయం రూ. 4.06 కోట్లు
NEWS Dec 28,2024 03:16 am
తిరుమల శ్రీవారిని 66 వేల 715 మంది భక్తులు దర్శించుకున్నారు. 24 వేల 503 మంది తల నీలాలు సమర్పించారు. కానుకలు, విరాళాల రూపేణా శ్రీవారి హుండీ ఆదాయం రూ. 4.06 కోట్లు వచ్చినట్లు వెల్లడించారు ఈవో . ప్రస్తుతం భక్తులు 29 కంపార్టుమెంట్లలో వేచి ఉన్నారని, సర్వ దర్శనం కోసం ఎలాంటి టోకెన్లు లేని భక్తులకు కనీసం 20 గంటలకు పైగా సమయం పడుతుందని తెలిపారు.