అధికారిక లాంఛనాలతో మన్మోహన్ అంత్యక్రియలు
NEWS Dec 28,2024 03:05 am
మాజీ ప్రధానమంత్రి డాక్టర్ మన్మోహన్ సింగ్ అంత్యక్రియలు ఇవాళ జరగనున్నాయి. మోడీ ప్రభుత్వం అధికారికంగా నిగమ్ బోధ్ ఘాట్ లో జరపనున్నట్లు ప్రకటించింది. సింగ్ నివాసం నుంచి ఏఐసీసీ ప్రధాన కార్యాలయానికి పార్థివ దేహం తరలిస్తారు. కాంగ్రెస్ శ్రేణులు , అభిమానులు నివాళులు అర్పిస్తారు. 11.45 నిమిషాలకు అంత్యక్రియలు నిర్వహిస్తారు. కేంద్రం సంతాప సూచకంగా 7 రోజుల పాటు సంతాప దినాలు ప్రకటించింది.