29న నిజామాబాద్ కు ఎమ్మెల్సీ కవిత
NEWS Dec 27,2024 06:28 pm
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఈ నెల 29వ తేదీన నిజామాబాద్ కు విచ్చేచున్నారని పార్టీ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి తెలిపారు. అక్రమ కేసులో బీజేపీ పార్టీ ఎన్ని నిర్భంధాలకు గురి చేసినా మొక్కవోని ధైర్యంతో ప్రజా క్షేత్రంలో పోరాటం సాగిస్తున్న ఎమ్మెల్సీ కవిత ఈ నెల 29న ఉదయం హైదరాబాద్ నుంచి నిజామాబాద్ వస్తున్నట్లు తెలిపారు. కార్యకర్తలు, నాయకులు హాజరై విజయవంతం చేసుకోవాలన్నారు.