మున్సిపల్ కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ వర్కర్స్ జిల్లా అధ్యక్షుడిగా బర్ల లక్ష్మణ్
NEWS Dec 27,2024 06:27 pm
జగిత్యాల జిల్లా నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. మెట్ పల్లి మున్సిపల్ కార్మికులకు 5 పదవులు దక్కాయి. మున్సిపల్ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడిగా బర్ల లక్ష్మణ్, కార్యదర్శులుగా లంక శ్రీకాంత్, బి మధురమ్మ, టి సుమన్, పి గంగాధర్, ఎల్ మహేష్ లను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అనంతరం వారు మాట్లాడుతూ. జిల్లా కమిటీకి ఎన్నుకున్నందుకు రాష్ట్ర నాయకులకు జిల్లా నాయకులకు తోటి కార్మిక సంఘ నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు సుతారి రాములు పాల్గొన్నారు.