మాజీ ప్రధాని మృతి తీరని లోటు
NEWS Dec 28,2024 05:38 am
దేశ మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మృతి తీరని లోటని కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకట రమణారెడ్డి అన్నారు. దేశం గొప్ప ఆర్థిక సంస్కర్తను కోల్పోయిందని, మన్మోహన్ సింగ్ మరణం తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఉపాధి హామీ, ఆధార్, ఆర్టీఐ, విద్యాహక్కు చట్టం తీసుకొచ్చారని, అనేక పదవులను మన్మోహన్ సమర్థంగా నిర్వహించారన్నారు.