మన్మోహన్ సింగ్ కి ఘన నివాళులు
NEWS Dec 27,2024 06:28 pm
మల్లాపూర్ మండలం వేంపల్లి గ్రామంలో మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మరణానికి చింతిస్తూ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఘనంగా నివాళులు అర్పించారు. ఆయన చిత్రపటానికి పూలమాల వేసి శ్రద్ధాంజలి ఘటించారు. దేశం గొప్ప నాయకున్ని, ఆర్థిక వేత్తని కోల్పోయిందని కోరుట్ల యువజన కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు పోతు శేఖర్ అన్నారు. కార్యక్రమంలో మాజీ సర్పంచ్ లు జలపతి రెడ్డి, శంకర్, నాయకులు ఇంద్రాల హరీష్ తదితరులు పాల్గొన్నారు.