ఎస్ఎస్ఏ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలి
NEWS Dec 27,2024 12:20 pm
సమగ్ర శిక్ష ఉద్యోగుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని తపస్ మెదక్ జిల్లా ప్రధాన కార్యదర్శి చల్లా లక్ష్మణ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గత 18 సంవత్సరాలుగా అతి తక్కువ వేతనాలతో పని చేస్తున్నారని, 18 రోజులుగా ధర్నా చేస్తున్న ప్రభుత్వం స్పందించక పోవడం దారుణమని వారన్నారు. ఈ కార్యక్రమంలో వెంకటేష్, కృష్ణమూర్తి, సురేందర్, రేఖ, సుమతి, అమరేశ్వరి తదితరులు పాల్గొన్నారు